అత్యవసర భేటీలు: తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు

హైదరాబాద్‌: తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు అత్యవసర సమావేశాలు చేపట్టాయి. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశానికి డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సహా 15 మంది మంత్రులు హాజరయ్యారు. అందుబాటులో ఉన్న పొలిట్‌ బ్యూరో సభ్యులు, ఎమ్యెల్యేలలతో తెరాస అధినేత కుసీఆర్‌ కూడా అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.