ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం

*****
సైదాపూర్ జనం సాక్షి ఫిబ్రవరి3;మండలంలోని వివిధ గ్రామాలకు రెండు కోట్ల 80 లక్షల నిధులను మంజూరు చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబును సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. సింగాపూర్ లో ఎమ్మెల్యేను కలిసిన సర్పంచులు, నాయకులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ఏ గ్రామాలకు ఎన్ని నిధులు వచ్చాయి.. మరి ఏమైనా నిధులు అవసరం ఉన్నాయా ..అనే విషయాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన గ్రామాలకు మరిన్ని నిధులను తీసుకురావాలని ఆయన అన్నారు. మంజూరైన నిధులతో ఆయా గ్రామాల్లో సిసి రోడ్లను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్ష ,కార్యదర్శి చంద శ్రీనివాస్, కాయిత రాములు, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు పోలు ప్రవీణ్, కిటకిట రాజు తదితరులు పాల్గొన్నారు.