ఏసీసీఎస్సీ సభ్యుడి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డి ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. యాసఫ్‌గూడలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాలో కొన్ని బ్యాంక్‌ పత్రాలతో పాటు మరికొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ,ఇంటర్‌ బోర్డు, ఏపీపీఎస్సీ సభ్యుడిగా అవినీతి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో రిపుంజయ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.