ఓ చేత్తో అనుమతిచ్చి…మరో చేత్తో అడ్డగిస్తున్నారు: కోదండరాం
హైదరాబాద్: ప్రభుత్వం కవాతు నిర్వహించుకోవడానికి ఓ చేత్తో అనుమతి ఇచ్చి.. మరో చేత్తో అడ్డగిస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ధ్వజమెత్తారు. కవాతు భయంతో పాలన నిర్వహించుకోలేక సచివాలయం మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం తాళాలు వేసుకుందని ఆయన విమర్శించారు. కవాతుకు వస్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇలా వ్యవహరించడం దారుణమన్నారు.