డ్రైనేజ్లు మనుషులచే శుభ్రం చేయించడం పై చర్యలు చేపడతామని ప్రధాని హమీ ఇచ్చారు: అమీర్ఖాన్
ఢీల్లీ: పారిశుద్ద్య కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చపడతామని ప్రధాని మన్మోహన్సింగ్ హమీ ఇచ్చారని బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ చెప్పారు. ప్రధాని అకూలంగా స్పందించారన్న అమీర్ ఖాన్ కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాలూ సహకరించాలని కోరారు. ఈరోజు ఆయన ప్రధానిని కలిసి పారిశుద్ధ్య పనివారి వెతనల గురించి చర్చించారు. చేతులతో అశుద్ధాన్ని ఎత్తిపోసే పద్ధతి మాన్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపధ్యంలోనే అమీర్ఖాన్ ప్రధానిని కలిశారు.