తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పులివర్తి

సైదాబాద్‌ (హైదరాబాద్‌): తెలుగులో అత్యధికంగా ఆధ్మాత్మిక చింతనపై వ్యాసాలు రాసినందుకు సైదాబాద్‌లోని జయనగర్‌ కాలనీకి చెందిన రచయిత, కవి డాక్టర్‌ పులివర్తి కృష్ణమూర్తికి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగువారి ప్రతిభను ప్రపంచ వ్యాప్తం చేసే తెలుగు ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదుతో పాటు విశిష్ట సత్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో సాంస్కృతిక అధ్యక్షుడు రమణమూర్తి చేతుల మీదుగా ఇటీవల జరిగిన కార్యక్రమంలో ధ్రువ పత్రాన్ని అందుకున్నారు. గతంలో వండర్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లలో కూడా పులివర్తి పేరు నమోదైంది.