సంగారెడ్డి,మార్చి5 (జనం సాక్షి): ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మానవత్వం చాటుకున్నారు. అన్నాసాగర్ చెరువు కట్ట వద్ద రోడ్డుప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు. అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ గ్రామంలో దళితబంధు, మన ఊరు`మన బడి పథకాల అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వెళ్తున్నారు. అదే సమయంలో అన్నాసాగర్ చెరువు కట్ట వద్ద లారీ, ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఎమ్మెల్యే కిరణ్ తన కారును ఆపి.. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సవిూప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించాలని వైద్యులతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడారు.
Other News
- టిఆర్ఎస్ పాలనే తెలంగాణకు రక్ష
- కాంగ్రెస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్
- కొండగట్టులో ఘనంగా హనుమత్ జయంతి
- వానాకాలం పంటల సాగుకు యాక్షన్ప్లాన్
- అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు
- కోనసీమలో నిఘా వైఫల్యం
- కంటి సమస్యలుంటే రంది పడొద్దు: మంత్రి హరీష్ రావు భరోసా
- *బీసీ యువతకు నైపుణ్యాభివ్రుద్ది కార్యక్రమాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ*
- *సి పి ఎస్ రద్దు చేసినందుకు, శ్రీ అశోక్ గెహ్లాట్ కు సెల్యూట్*
- *రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు*