మేదర కులస్తుల సమస్యలను ముఖ్యమంత్రి కె సి ఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తా : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ,

|
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ప్రపంచ వెదురు దినోత్సవం సందర్బంగా రంగా రెడ్డి జిల్లా మేదర సంఘం ఆధ్వర్యంలో వెదురు దినోత్సవం వేడుకలు ఈ రోజు ఉదయం #తుర్కయాంజల్ లోని రొక్కం సత్తి రెడ్డి గార్డెన్స్# నందు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యులు మరియు జాతీయ బి సి సంఘం అద్యక్షులు ఆర్ . కృష్ణయ్య , రాష్ట్ర బి సి కమీషన్ చైర్మన్ వకుళాభరణం క్రిష్ణ మోహన్ , ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ , తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ కురుమ ,గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ సంరెడ్డి భుజంగ రెడ్డి , శ్రీ కొత్తకుర్మ శివ కుమార్ , కొత్తకుర్మ మంగమ్మ తదితరులు ముఖ్యఅతిథులుగా విచ్చేసి పాల్గొన్నారు . ఈ సందర్బంగా మేదర సంఘం ప్రతినిథులు మాట్లాడుతూ తమ కులవృత్తిలో బాగంగా వెదురు బుట్టలు, గంపలు, వెదురుతో తయారయిన అలంకార వస్తువుల వినియోగం తగ్గిపోయినదని , మిగతా బి సి కులాలైన కురుమ , యాదవులకు గొర్రెల పెంపకం, ముదిరాజ్ లకు చేపలపెంపకంకు ప్రోత్సహించినట్లు తమ మేదరి కులానికి ప్రోత్సహించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ మేదర సంఘం సోదరులకు ప్రపంచ వెదురు దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు . కులవృత్తులలో బాగంగా మనం వినియోగించే వస్తువుల వాడకం పెంచాలని దాని ద్వారా కులవృత్తులను ప్రోత్సహించవచ్చని, మేదర కులస్తుల సమస్యలను ముఖ్యమంత్రి కె సి ఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు . ఈ కార్యక్రమంలో మేదరి సంఘం రంగా రెడ్డి జిల్లా
ప్రెసిడెంట్ జొర్రీగల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి , నందికంటి చంద్ర శేఖర్ ,
కోశాధికారి నందికంటి కనకరాజ్,
ప్రచార కార్యదర్శి కల్లూరి శివ , గౌరవ అధ్యక్షులు ఇందూరి శ్రీనివాస్ ప్రతినిథులు ఇందూరి చెన్నయ్య , జొర్రీగల జగన్ ,నోముల మహావీర్ బొమ్మిడి కృష్ణ మరియు మేదరి సంఘం సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Attachments area
|



