యూపీఏ సర్కారు గద్దె దిగాలి: బీజేపీ

హైదరాబాద్‌: భాగస్వామ్యపక్షాలు, ప్రతిపక్షాలు సహా ప్రజల విశ్వాసం కోల్పోయిన యూపీఏ సర్కారు గద్దె దిగాలని బీజేపీ జాతీయా అధికార ప్రతినిధి షానవాజ్‌హుస్పేన్‌ డిమాండ్‌ చేశారు. రేపు భారత్‌బంద్‌లో పాల్గొనెందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అనుమతించటం వల్ల భారతీయులకు వచ్చే ఉద్యోగాలు, సేల్స్‌మెన్‌, సేల్స్‌గర్ల్‌ ఉద్యోగాలేనని అన్నారు.