రాజీనామా చేసినా ఒడిశా న్యాయశాఖ మంత్రి

భువనేశ్వర్‌ : ఒడిశా న్యాయశాఖ మంత్రి రఘునాథ్‌ మొహంతీ తన పదవికి రాజీనామా చేశారు. తరపై వరకట్న వేధింపుల కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరకట్నం వేధింపులకు పాల్పడుతున్నారని కోడటు బర్షాసోనీ మొహంతీ మంత్రి కుటుంబసభ్యులపై బాలాసోర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మంత్రి సీఎం నవీన్‌ పట్నాయక్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.