రాజ్యంగ సంక్షభం లేదు

బెంగుళూరు: కార్ణటకలో ప్రస్తుతం రాజ్యంగ సంక్షభం ఏమీ నెలకొనలేదని గవర్నర్‌ హెచ్‌.ఆర్‌.భరద్వాజ్‌ అన్నారు. మంగళవారం సాయంత్రమిక్కడ ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలు, ఉపసంహరణ గురించి ముఖ్యమంత్రి సదానందగౌడ ఇప్పటికే తనను కలుసుకుని చర్చించారని చెప్పారు. కరువు సహాయక చర్యల్ని తీసుకోవాలని సదానందకు తాను సూచించానన్నారు. మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప కూడా తనను పలుమార్లు కలిసి చర్చించారని తెలిపారు. తమ మధ్య రహస్య సమావేశాలేవీ జరగలేదని చెప్పారు.