విజయవాడకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంషాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరివెళ్లారు. సీఎంతోపాటు మంత్రులు బొత్స, పితాని,కన్నా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.వాతావరణ అనుకూలించకపోవడంతో కాసేపు శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం వేచి ఉన్నారు. ఏటీసీ అనుమతి అనంతరం విమానం విజయవాడకు బయలుదేరింది.