వీరవనిత చాకలి ఐలమ్మ ధీరత్వం అందరికీ స్పూర్తి దాయకం :రాష్ట్ర ఐ ఎన్ టి సి అధ్యక్షులు ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మిద్దెల జితేందర్

ఎల్బీ నగర్( జనం సాక్షి  )  వీరవనిత మన చాకలి ఐలమ్మ ఆమె ధీరత్వం అందరికీ స్పూర్తి దాయకం అని  రాష్ట్ర ఐ ఎన్ టి సి అధ్యక్షులు ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మిద్దెల జితేందర్ అన్నారు  శనివారం   చెంప పేటలో   జరిగిన సాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా    రాష్ట్ర ఐ ఎన్ టి సి అధ్యక్షులు ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మిద్దెల జితేందర్ పాల్గొన్నారు  చాకలి ఐలమ్మకు పూల మాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్బంగా మిద్దెల జితేందర్   మాట్లాడుతూ స్వతంత్ర భారతావనిలో ఎందరోధీరవనితలు బ్రిటిష్ వారిపై , రజాకారులపై పెత్తందారులపై పోరాటం చేసిన ధీర మహిళల్లో చాకలి అయిలమ్మ ఒకరని ఆమె పోరాటంలో  కొడుకుల్ని కూతురుని భర్తని  పోగొట్టుకున్నటువంటి దీరవనిత అని ఆమె బడుగు బలహీన వర్గాల కోసం ఒక స్ఫూర్తి దాత అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో నారాయణ బి శ్రీనివాస్ రాము తదితరులు పాల్గొన్నారు