సీఎం, మంత్రుల జిల్లాల్లోనే ఎక్కువ కరవు ప్రాంతాలు : కేటీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి, పలువురు మంత్రుల జిల్లాల్లోనే ఎక్కువ మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. కరువు పరిహారం విషయంలో తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్నారని, తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కేటీఆర్‌ అన్నారు.