అంగన్వాడి పిల్లలకు రాగి లడ్డూల పంపిణీ 

రుద్రంగి సెప్టెంబర్ 10 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అంగన్వాడీ పిల్లలకు ఒకటి నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ రాగి లడ్డూలను సర్పంచ్ ప్రబలత మనోహర్ ఎంపిటిసి లావణ్య తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పిల్లలు ఎలాంటి పౌష్టికాహార లోపం లేకుండా ఉండడం కోసం వారి ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలకు  యధావిధిగా కొనసాగించాలని తెలియజేస్తూ ప్రభుత్వ సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్,ఎంపీఓ సుధాకర్, వార్డు సభ్యులు,పిల్లల తల్లిదండ్రులు,ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు మరియు సిఏలు తదితరులు పాల్గొన్నారు