అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ కార్యక్రమం*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పోషణ అభియాన్ పథకం గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు,చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని  అంగన్వాడీ టీచర్ చింతమళ్ళ ప్రీతి అన్నారు.శుక్రవారం పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మున్సిపాల్టీ పరిధిలో రామాపురంలో అంగన్వాడీ కేంద్రం అధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సాముహిక శ్రీమంతాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోటేశ్వరమ్మ,శాంతి నగర్  అంగన్వాడీ టీచర్,జయమ్మ,
అంగన్వాడీ అయా,తదితరులు ఉన్నారు.