అండమాన్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.5గా నమోదైంది. అండమన్ దీవుల్లోని మోహిన్‌కు 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఉదయం పూట భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. రోడ్లపైకి పరుగులు తీశారు.