అంతరిక్షంలో సమోసాలు తిన్నాను

సునీతా విలియమ్స్‌
న్యూఢీల్లీ : అంతరిక్షంలో తాను భారతీయ వంటకాలనే తీసుకునేదాన్నిని భారత వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన అనుభూతులను పంచుకున్నారు. భారత్‌లో పర్యటిస్తున్న సునీతా ఢీల్లీ జాతీయ సైన్స్‌ సెంటర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత వంటకాలపై తనకున్న మక్కువను చాటుకున్నారు. అంతరిక్షంలో
భారరహిత స్థితిలో తాను సమోసాలను తిన్నానని చెప్పారు. భగవద్గీత. ఉపనిషత్తులను తన వెంట ఉంచుకున్నానని తెలిపారు. ఎంతోగానో మద్దుతునిచ్చే కుటుంబసభ్యులు తనకు ఉండటం అదృష్టమని పేర్కొన్నారు.