‘అందరూ పాటిస్తేనే విజయవంతం’

99ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు.. తమ ప్రభుత్వం ఎంతో ధైర్యంగా సరి, బేసి విధానాన్ని ప్రవేశ పెట్టిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీని పొల్యుషన్ ఫ్రీ నగరంగా మార్చేందుకు అన్ని స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఢిల్లోలోని ఓ స్కూళ్లో జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. సరి, బేసి విధానానికి విద్యార్థులంతా సహకరించాలని కోరారు. తమ తల్లితండ్రులు ఈ రూల్స్ ఫాలో అయ్యేలా వారికి సూచనలు చేయాలని కోరారు. ఢిల్లీని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని.. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు.