అంబేద్కర్‌కు ఘనంగా నివాళి

హైదరాబాద్‌,డిసెంబర్‌6 (జనంసాక్షి) :
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ 56వ వర్థంతి సందర్భంగా ఆయనకు ప్రజలు, ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. పలువురు నేతలు ఈరోజు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. మంత్రులు దానం నాగేందర్‌, కొండ్రు మురళి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతిలు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ ఆశయ సాధనలో భాగంగానే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ అమలుచేసిందని మంత్రి దానం అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడ దళిత, బడుగు, బలహీన వర్గాల వారున్నా వారికి కాంగ్రెస్‌ పార్టీ పూర్తి న్యాయం చేస్తుందని ఆయన అన్నారు. అంబేద్కర్‌ కల్పించిన హక్కుల వల్లనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని అన్నారు .