అంబేద్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు

అమరచింత: ఆత్మకూరు మండలంలోని అమరచింత , సింగంపేట, ఖానాపూర్‌, నందిమల్ల గ్రామాల్లో డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూలమల్లలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ గోవర్ధనగిరి, ఎస్సై గాంధీనాయక్‌, తహశీల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, దళిత సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.