అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి

మాల మహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దళిత రత్న డాక్టర్ బి జనార్ధన్
జహీరాబాద్ నవంబర్ 2 (జనం సాక్షి)
జోగులాంబ గద్వాల జిల్లా తొర్రూర్ మండలం రేవులపల్లి గ్రామంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాల మహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దళిత రత్న డాక్టర్ బి జనార్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కావాలని కూలగొట్టిన దుండగులను వెంటనే శిక్షించి అంబేద్కర్ విగ్రహాన్ని చూడాలంటేనే భయపడే విధంగా కఠినమైన చట్టాలు తేవాలని బహిరంగంగా ఉరితీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశానికి దిశా దశ చూపించిన దేవుడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన వ్యక్తులను బహిరంగంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షాన మాలమహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేశం ప్రధాన కార్యదర్శి జే మధుసూదన్ జిల్లా నాయకులు బి మురళి రిటైర్డ్ టీచర్ రామ్ చందర్ దానయ్య పద్మారావు. జిల్లా మాల మహానాడు యువజన నాయకుడు బి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.