అకాల వర్షంతో రైతన్నలకు నష్టం
ఆదిలాబాద్,మార్చి2(జనంసాక్షి): అకాల వర్షాలు మరోమారు రైతు నెత్తిన పిడుగులా పడ్డాయి. దీంతో కొన్నిచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. ఎండలతో మండుతున్న జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ అకాల వర్షంతో పెద్దగా ఆస్తుల నష్టం లేకపోయినా పంటలు మాత్రం నష్టపోయాయి. ఆయా ప్రాంతాల్లో పండిస్తున్న పసుపు, మిర్చి, గోధుమ, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే అకస్మాత్తుగా ప్రారంభమైన వర్షంతో వాతావరణం చల్లగా మారింది. చలినుంచి తేరుకుని ఎండలు మొదలైన తొలినాళ్లలోనే అకాల వర్షంతో వాతావరణం చల్లబడింది. ఆదిలాబాద్లో 18 మి.విూ, ఇచ్చోడలో 13.6 మి.విూ, నేరడిగొండలో 12.4 మి.విూ, గుడిహత్నూర్ 12.2 మి.విూ, ఖానాపూర్ 4.6 మి.విూ, ఇంద్రవెల్లి 4.0 మి.విూల వర్షపాతం నమోదైంది. భైంసాలో 57 మి.మి వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా లక్ష్మణచాంద, బేల మండలాల్లో 2.4 మి.మి. నమోదైంది.



