అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం సీజ్

చండ్రుగొండ జనం సాక్షి (ఆగస్టు 26) : అక్రమంగా పశువులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని శుక్రవారం స్థానిక పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై విజయ లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం బ్లూ కోట్ పోలీసులు శుక్రవారం జూలూరుపాడు రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన డిసిఎం వాహన డ్రైవర్ పోలీసులను చూసి ఆపకుండా వెళ్లి పోయాడు అప్రమత్తమైన పోలీసులు డీసీఎం వాహనాన్ని వెంబడించి లంకలవాగు ముత్యాలమ్మ ఆలయం వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో సుమారు 50 పశువులు ఉన్నాయని వాహనాన్ని డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల ఆదేశాలతో పశువులను పాల్వంచ గోశాలకు తరలించామని తెలిపారు