అక్రమ లే ఔట్లపై విచారణ: డిపివో

చిత్తూరు,జూలై25(జ‌నంసాక్షి):జిల్లాలో అక్రమంగా ఎన్‌వోసీ ప్రతాలు లేకుండా వేసిన లేఅవుట్లపై
పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని జిల్లా పంచాయతీ అధికారి అన్నారు. పంచాయితీ నిధులను దుర్వినియోగం చేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. పంచాయతీల నిధుల దుర్వినియోగం విషయంలో గతంలో కొందరు  సర్పంచుల చెక్‌పవర్‌ రద్దు చేశారు. అక్రమ లేవుట్లు తిరుపతి తుడా పరిధిలోని పంచాయతీల్లో ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అక్రమ లేవుట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకునేందుకు పంచాయతీల నుంచి అనుమతి కోరినప్పుడు స్థలం విలువలో పదిశాతం పంచాయతీ రుసుముగా వసూలు చేసి అనుమతులు ఇస్తున్నామని తెలిపారు.