అక్రమ సంబంధానికి అడ్గుగా ఉన్నారని అత్తామామలను చంపేసింది

vfzk7nm1
బెంగళూరు: అక్రమ సంబంధానికి అడ్గుగా ఉన్నారని సహించలేని కోడలు ప్రియుడితో కలిసి అత్తామామలను అతిదారుణంగా హత్య చేసిన సంఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపింది. ఈ దాడి నుంచి ఆమె భర్త తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాడుగోడి సమీపంలోని ఎకేజే కాలనీలో నివాసం ఉంటున్న కణ్ణన్ (70), మనోరమా (65) అనే దంపతులు కోడలు, ఆమె ప్రియుడి చేతిలో సోమవారం రాత్రి దారుణ హత్యకు గురైనారని కాడుగోడి పోలీసులు చెప్పారు. కణ్ణన్, మనోరమ దంపతులకు మణికంఠన్ అనే కుమారుడు ఉన్నాడు. మణికంఠన్ భార్య దుర్గా (28). దుర్గా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అంజి అనే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్నది. ఈ విషయం కణ్ణన్, మనోరమాకు తెలియడంతో కోడలిని హెచ్చరించారు.

ఈనెల 4వ తేది సోమవారం మణికంఠన్ పని మీద బయటకు వెళ్లాడు. తరువాత దుర్గా తాను అవ్వ ఇంటికి వెళుతున్నానని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. రాత్రి పొద్దుపోయిన తరువాత దుర్గా ఇంటికి వెళ్లింది. ఆ సందర్బంలో దుర్గాను అత్త, మామ ప్రశ్నించారు. అంతే సహనం కొల్పోయిన దుర్గా ఫోన్ చేసి ప్రియుడు అంజిని పిలిపించింది. తరువాత ఇద్దరూ కలిసి సుత్తి, కొడవలి తీసుకుని అత్త, మామ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో అక్కడే ఇద్దరి ప్రాణాలు పోయాయి. అదే సమయంలో మణికంఠన్ ఇంటికి వచ్చాడు. దుర్గా ప్రియుడు అంజితో కలిసి భర్త ను హత్య చెయ్యడానికి ప్రయత్నించింది. అయితే మణికంఠన్ గాయాలతో తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య చేసి పారిపోతున్న దుర్గా, ఆమె ప్రియుడు అంజిని అరెస్టు చేశామని కాడుగోడి పోలీసులు తెలిపారు. కణ్ణన్, మనోరమ దంపతులు తమిళనాడుకు చెందిన వారు. బెంగళూరు చేరుకుని కాడుగోడి సమీపంలోని ఎకేజే కాలనీలో నివాసం ఉంటున్నారు. మణికంఠన్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.