అగ్నిప్రమాదంలో గుడిసెలు దగ్ధం

ముంబై,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లాల్‌మతి వద్ద మురికివాడలో ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 11:30 గంటల సమయంలో అక్కడున్న ఓ గుడిసెలో నుంచి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో.. అన్ని గుడిసెలు బుగ్గిపాలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు 9 ఫైరింజన్లు ప్రయత్నించాయి. అయితే గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధిత కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి.