అగ్నిప్రమాదంలో 20 పూరిళ్లు దగ్ధం

ఖమ్మం జిల్లా : కూసుమంచి మండలం భగవత్‌ వీరతండాలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 పూరిళ్లు అగ్నికి అహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ఆస్తినష్టం అంచనా వేస్తున్నారు.