అఘాయిత్యానికి పాల్పడి బస్సులోంచి తోసేశారు

గువహటి: ఈశాన్య భారతంలో మరో నిర్భయ ఉదంతం వెలుగుచూసింది. అసోంలోని బక్సా జిల్లా గోరేశ్వర్లో 13 ఏళ్ల బాలికను బస్సులో సామూహిక అత్యాచారం చేశారు.
పోలీసులు తెలిపిన సమాచారం మేరకు బాధితురాలిది సోనిట్పూర్ జిల్లా బెహాలి ప్రాంతం. ఖోర్గెస్వర్ బొరొలో ఓ ఇంట్లో పనిచేస్తోంది.
 గత ఆదివారం సాయంత్రం ఈ అమ్మాయి సొంతూరు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. గోరేశ్వర్ సమీపానికి బస్సు వెళ్లే సరికి ప్రయాణికులందరూ దిగిపోగా..
 ఈ బాలిక మాత్రమే మిగిలింది. ఆ సమయంలో నిందితులు అఘాయిత్యానికి పాల్పడి బస్సులోంచి ఆమెను తోసివేశారు. బాధితురాలిని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు.
ఈ ఘటనపై ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం వందలాదిమంది విద్యార్థులు, మహిళలు, గ్రామస్తులు గోరేశ్వర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అసోం పోలీసులకు సిగ్గుచేటు అసోం ప్రభుత్వానికి సిగ్గుచేటు మహిళల గౌరవాన్ని కాపాడండి
 వంటి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలియజేశారు. ఈ కేసులో నిందితులను గుర్తించామని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు బక్సా ఎస్పీ మొజిబుర్ రహ్మాన్ చెప్పారు.