అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం

 

దమ్మపేట : మండలంలోని అల్కంపాలెం అటవీ ప్రాంతంలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పశువుల కాపరులకి రెండు రోజుల క్రితమే గుర్తిచినావారు. భయపడి విషయాన్ని ఎవ్వరికి చెప్పలేదు అనోటా ఈ నోటా గ్రామమంతా ఈ విషయం తెలియడంతో పోలిసులు అటవీ ప్రాంతమంతా బుధవారం గాలింపు చర్యలు చేపట్టినా అ చూకీ లబించలేదు.గురువారం ఉదయం పోలిసులు పశువుల కాపరులను తీసుకుని వెళ్లగా గుట్టపై భాగంలో మృతదేహం కనపడింది. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోలిసులు కేసు నమాదు చేసి దర్యాప్తు చేపట్టారు.