అత్యాధునిక స్కూల్ను ప్రారంభించిన జవదేకర్
జైపూర్,సెప్టెంబర్8(జనంసాక్షి): విద్యావారోత్సవాల్లో భాగంగా రాజస్థాన్లో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మకడ్వాలీ గ్రామంలో సీబీఎస్ఈ ఇంగ్లీష్ విూడియం స్కూల్ ప్రారంభించారు. వివేకానంద మోడల్ స్కూల్లో 24 తరగతి గదులతోపాటు మూడు స్మార్ట్ క్లాస్లు, అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం, క్రీడా
సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా మోడల్ స్కూల్ను ప్రారంభించినట్లు జవదేకర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడేవిధంగా..వారిని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మోడల్ స్కూళ్లకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ ఏడాది మొత్తం 100 మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జవదేకర్ పేర్కొన్నారు.