అదుపుతప్పిన బస్సు: ఇద్దరు మృతి

సిమ్లా,ఆగస్ట్‌30: హిమాచల్‌ప్రదేశ్‌లోని చాంబ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.