అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

ఎమ్మెల్యే తనయుడికి తీవ్రగాయాలు
కాకినాడ,మార్చి2(జనం సాక్షి): తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదురులంక జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముమ్మడివరం శాసనసభ సభ్యుడు పొన్నాడ సతీశ్‌ కుమారుడు, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి కాకినాడ నుంచి అమలాపురం వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. కుమారుడికి స్వల్ప గాయాలు కాగా మేనల్లుడు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.