అధికారుల అలసత్వం కూడా కారణమే: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యకు ప్రకృతి సహకరించకపోవడంతో పాటు అధికారుల అలసత్వం కూడా కారణమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.  లక్షింపేట ఘటనలో తనపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని బొత్స ఆవేదం వ్యక్తం చేశారు.విద్యుత్‌ విషయంలో భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.ఎన్నికలయ్యాక భర్త మరణానికి సంబంధించి తలెత్తిన అనుమానాలను వైఎస్‌ విజయ మర్చిపోయారని బొత్స వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ బాటలో ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఆరోపించారు.