అధికారుల తీరుకు నిరసనగా సభను వాకౌట్ చేసిన ప్రజాప్రతినిధులు

జనంసాక్షి   రాజంపేట్
 మండల కేంద్రంలోని ఎంపీపీ లింగాల స్వరూప అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు సర్వసభ సమావేశం ప్రారంభించిన పదినిమిషాలకే వాకౌట్ చేసిన ప్రజాప్రతినిధులు పూర్తి వివరాలకు వెళ్తే రాజంపేట్ మండల సర్వ సమావేశం.  ఎప్పటిలాగే ఈసారి కూడా వాక్ అవుట్ జరిగింది ప్రజాప్రతినిధుల అధికారుల మధ్య వాగ్దానం జరిగింది శివాయపల్లి గ్రామ సర్పంచ్ విట్టల్ రెడ్డి గుండారం ఎంపిటిసి ఆజ్ నాయక్ ఎంపీడీవో బాలకిషన్ మధ్య తీవ్రవాఙ్ఞానం జరిగింది రాజంపేట్ మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా ఆసరా పింఛన్ల లిస్ట్ ఎలా బయటకు వెళుతుంది కనీసం ప్రజాప్రతినిధులను గౌరవం ఇవ్వకుండా ఇష్ట రాజ్యాంగ అధికారులు పనిచేయడం సిగ్గు సిగ్గుతో తలదించుకున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు గత మూడు సర్వ సభ సమావేశాలు వాక్ అవుట్ అవుతున్న పట్టించుకోని అధికారులు సమయానికి అధికారులు రాకపోవడంతో అదేవిధంగా రాజంపేట్ మండల కేంద్రం ఇటు కామారెడ్డి నియోజకవర్గం ఆర్టు ఎల్లారెడ్డి నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు కలిపి ఉండడం వల్ల కొంత పనులు కాకపోవడంతో ప్రజాప్రతితులు ఆ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సర్పంచులు ఎంపీటీసీగా గెలిచిన మాకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత మూడు సమావేశాలు వాకౌట్ చేసిన అధికారులు మాత్రం సభ నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సభ సర్వ సమావేశాలు సజావు సాగేటట్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికారపాటికి చెందిన ప్రజా ప్రజలకు ఈ విధంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతితులకు అధికారులు ఏ విధంగా విలువ అర్థమవుతుంది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకిషన్  వైస్ ఎంపీపీ దుబ్బని సావిత్రి జెడ్పిటిసి కొండ హనుమాన్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు