అధిక మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి ని గెలిపించాలి

జనం సాక్షి,నర్సంపేట

దుగ్గొండి మండలంలోని చలపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు ఉల్లేరావు సాంబయ్య ఆధ్వర్యంలో గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. గ్రామం లో 1000 ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీలకు దళిత బంధు, మూడెకరాల భూమి,డబుల్ బెడ్రూంలో గ్రామానికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కోటగిరి భాస్కర్ కాంగ్రెస్ నాయకులు గన్న శ్రీనివాసరెడ్డి, శంకేసి మహేందర్,అనుగోని తిరుపతి, దూలం తిరుమలేశ,కోలా రవీందర్, కోవాకుల సదయ్య, గొడిశాల లింగయ్య, పూజారి రాంబాబు, నల్ల సాయిరెడ్డి, నల్ల తిరుపతిరెడ్డి, కోల శ్రీను తదితరులు పాల్గొన్నారు.