అనిల్ అంబానీపై ఢిల్లీ సర్కార్ ఫైర్
అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీపై డైరెక్ట్ అటాక్ కు దిగింది ఢిల్లీ సర్కారు. విద్యుత్ చార్జీలు తగ్గకుండా అనిల్ అంబానీ కంపెనీ లంచాలిచ్చిందని ఆరోపించింది. ఈ వేసవిలో ఢిల్లీలో విద్యుత్ కోతలకు బీఎస్ఈఎస్ కంపెనీయే కారణమని అనిల్ అంబానికే లేఖ రాసింది. విద్యుత్ సమస్యలను తీర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన రోడ్ మ్యాప్ తో తమను కలవాలని సూచించింది. ఢిల్లీలో విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు తాము ప్రయత్నిస్తున్నప్పటికీ… బీఎస్ఈఎస్ సంస్థ అడ్డుపడుతుందని కేజ్రీ సర్కారు ఆరోపించింది. కాగ్ రిపోర్ట్ ను ఆధారంగా చూపించి… ఆరోపణలు చేయడంతో చర్చనీయాంశంగా మారింది.