అనుమానంతో భార్యను చంపిన భర్త

నెల్లూరు,ఫిబ్రవరి25( జనం సాక్షి): వెంకటాచలం మండలంలోని నిడిగుంటపాలెంలో దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానంతో గురువారం అర్ధరాత్రి భార్యను భర్త రాయపాటి బాల పెంచలయ్య అతి దారుణంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. భర్త దాడిలో గాయపడిన సుమతిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రిని తరలించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.