అనూహ్య హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

ypeno04gముంబైలో దారుణ హత్యకు గురైన ఏపీ అమ్మాయి అనూహ్య కేసులో కోర్టు తీర్పిచ్చింది. దోషి చంద్రభానుకు ముంబై కోర్టు మరణశిక్ష విధించింది. ముంబై టీసీఎస్ లో అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్ గా పనిచేసే అనూహ్య.. సొంతూరు మచిలీపట్నం వచ్చి వెళ్తూ హత్యకు గురైంది. 2014 జనవరి 5 న ముంబై రైల్వే స్టేషన్ లో దిగిన అనూహ్యను బైక్ పై తీసుకెళ్లిన టాక్సీ డ్రైవర్ చంద్రభాను అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆ తర్వాత దాదాపు పది రోజులకు కుళ్లిన స్థితిలో అనూహ్య డెడ్ బాడీని గుర్తించారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చంద్రభానే హత్య చేసినట్లు గుర్తించారు.