అన్నదమ్ముల ప్రాణాలు బలికొన్న భూవివాదం

నల్లగొండ,(జనంసాక్షి): భూవివాదం ఇద్దరి ప్రాణాలను బలికింది. భూవివాదంలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ ఘటన మోత్కూర్‌ మండలం బుజిలాపురంలో చోటు చేసుకుంది. మృతులు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.