అభివృద్ది ప్రదాత సిఎం చంద్రబాబు

ఆయన నాయకత్వమే ఎపికి శరణ్యం
మళ్లీ బాబుకు ఓటేసి గెలిపిస్తేనే మేలు: వర్ల
విజయవాడ,మార్చి27(జ‌నంసాక్షి): రాజధాని అమరావతి నిర్మాణంతో ఎపి దశ మారుతుందని పార్టీ ప్రతినిధి
వర్ల రామయ్య అన్నారు. సిఎం చంద్రబాబు చెప్పినట్లుగా పోలవరం, అమరావతి ఈ రెండూ ఎపికి రెండు కళ్లలాంటివన్నారు. ప్రతిపక్షాలు వట్టిసీమని ఎద్దేవా చేసినా నేడు అదే పట్టిసీమ డెల్టా రైతాంగానికి జీవనాధరామైందని  అన్నారు. పట్టిసీమపై విమర్శలు చేసేవారు నిజాలు గుర్తించడం లేదన్నారు. దేశంలోనే నదులను అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. టిడిపి గెలుపునకు ఇదే ప్రాణం అన్నారు. అభివృద్దిని ఎపి ప్రజలు ఆదరిస్తారని, బాబు నాయకత్వాన్ని అంగీకరిస్తారని అన్నారు. అమరావతి నిర్మాణం బాబుతోనే ముడిపడి ఉందన్నారు. జగన్‌ లాంటి నేతలను నమ్మితే ఎపికి అధోగతి తప్పదన్నారు.  యుద్దప్రాతిపదికన పట్టిసీమ తదితర ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రకటించిన తేదిన నీరు విడుదల చేయడం, డెల్టారైతాంగం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ది తేటతెల్లం చేస్తుందన్నారు. గోదావరి జలాలను కృష్ణా నదిలో అనుసంధానం చేయడం వల్ల నేడు డెల్టా రైతాంగానికి లబ్ది చేకూరుతుందన్నారు. సాగుపై పూర్తిగా ఆశలు కోల్పోయిన డెల్టా రైతాంగానికి పట్టిసీమ ఊపిరి పోస్తుందన్నారు. సాగునీటిని రైతాంగానికి అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నదుల అనుసంధానం ద్వారా డెల్టా రైతాంగానికి నీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి పట్టిసీమప్రాజెక్టును తీసుకు వస్తే, అప్పుడు ఎద్దేవా చేసిన వారే, ఇప్పుడు నోరుమూసు కున్నారన్నారు. డెల్టా ప్రాంతానికి పట్టిసిమ ప్రాజెక్టు వరప్రదాయనిగా పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమ ప్రాజెక్టును డిజైన్‌ చేసి డెల్టా రైతాంగానికి నీరు అందించడానికి చేసిన కృషి మరువలేనిదన్నారు. బాబుకు డెల్టా రైతాంగం రుణపడి ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుంద న్నారు. లేకపోతే నీటి యుద్దాలు సంభవించే దుస్థితి ఎదురవుతుందన్నారు. నీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయడానికి కేంద్రంపై తెలుగుదేశం ప్రభుత్వం తరుపున ఒత్తిడి తెస్తున్నట్లు ఎంపి పేర్కొన్నారు. నీటి వివాదాలను పరిష్కరించడానికి కేంద్రం ప్రత్యేక బోర్టును ఏర్పాటుచేయాలని కోరారు. విడివడ్డ ఎపిని మళ్లీ అభివృద్దిలోకి తీసుకుని వెళుతున్న నేత చంద్రాబాబు అని, ఆయనకే ప్రజలంతా మద్దతు ఇవ్వాలన్నారు.