అభివృద్ధికి పట్టం కడుదాం -గండ్ర ప్రియాంక రెడ్డి

చిట్యాల నవంబర్ 26(జనంసాక్షి) భూపాలపల్లి లో గులాబీ జండా ఎగరవేసి, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని మరోమారు గెలిపించుకొని అభివృద్ధికి పట్టం కడుదామని కూతురు ప్రియాంక రెడ్డి, కోడలు వైశాలి రెడ్డిలు అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ని హామీలను సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. అనంతరం ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పెద్దపీట వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డిని అధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలి.సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ,పట్టణానికి దీటుగా ప్రతి గ్రామానికి పక్క సీసీ రోడ్లు నిర్మించిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ని మరోమారు ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు .రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్తూరి రాజిరెడ్డి, మడికొండ రవీందర్రావు,స్థానిక ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్ ఏరుకొండ గణపతి,, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు తౌటం నవీన్, స్థానిక సర్పంచ్ ఇరుకులపాటి పూర్ణచందర్రావు, మాస్ రమేష్, చిదిరాల సరోజన, రాజు, రమేష్, సతీష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.