అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరికలు-ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.

అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరికలు-ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాళ్లూరు అక్టోబర్ 14( జలం సాక్షి)తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమపథ కాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెల్లడించారు.
శనివారం తాండూరు మండలంలోని సిరిగిరిపేట గ్రామానికి చెందిన దాదాపు 50 మందికి పైగా , పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన 50 మంది,తాండూరు పట్టణం15వ వార్డుకు చెందిన మహిళలు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ గూటికి చేరారు.వారిని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నఅభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని..రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయన్నారు.తాండూరు లో బంపర్ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.