అమరులకు అంత్యక్రియలు…
జమ్మూ కాశ్మీర్ : సరిహద్దులో పాక్ టెర్రరిస్టులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు అంత్యక్రియలు ముగిసాయి. జమ్మూ-కాశ్మీర్లో చొరబడిన మిలిటెంట్లను అదుపు చేసే ప్రయత్నంలో పంజాబ్కు చెందిన లాన్స్ నాయక్, హర్దేవ్ సింగ్లు మరణించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ వీరుల భౌతిక కాయాన్ని వారి స్వగ్రామాలకు తరలించిన ఆర్మీ ఉన్నతాధికారులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. అసలు సిసలైన దేశ భక్తులను కడసారిగా చూసుకునేందుకు గ్రామస్ధులతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు సైతం తండోపతండాలుగా వచ్చారు. వీర సైనికులకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు ఘనంగా పలికారు.