అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

amarnath-yatraఅమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. జమ్మూలోని భగవతీ నగర్ నుంచి శివభక్తులు యాత్రను మొదలుపెట్టారు. భం భం భోలే అంటూ ముందుకు కదిలారు. జమ్ముకశ్మీర్‌ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. యాత్ర సందర్భంగా జమ్మూ బేస్ క్యాంప్ కు భారీ సంఖ్యలో శివ భక్తులు చేరుకున్నారు. అధికారులు యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లను చేశారు. వందలాది మంది సాధువులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తొలి బ్యాచ్ లో సుమారు 15 వేల మంది యాత్రికులు అమర్నాథ్ దర్శనానికి వెళ్లనున్నారు. జమ్మూ కశ్మీర్ పోలీస్ తో పాటు ఆర్మ్‌డ్ వింగ్, సెక్యూర్టీ వింగ్, సీఆర్పీఎఫ్ దళాలు భద్రతను సమీక్షిస్తున్నాయి.