అయోధ్యలో రామాలయం నిర్మించాల్సిందే

ములాయం కోడలు అపర్ణాయాదవ్‌

లక్నో,నవంబర్‌1(జ‌నంసాక్షి): అయోధ్య రామాలయ నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ కోడలు అపర్ణా యాదవ్‌ పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించాల్సిందేనన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నానని,అందుకోసం వేచి చూస్తానని ఆమె పేర్కొన్నారు. అయోధ్య భూ వివాదం కేసును జనవరికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లోగా ఈ కేసు కొలిక్కి వస్తుందని భావించిన బీజేపీ నేతలు.. సుప్రీం నిర్ణయంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అపర్ణాయాదవ్‌ స్పందిస్తూ.. సుప్రీంకోర్టుపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కేసును జనవరిలో విచారిస్తామని సుప్రీం చెబితే… అందుకు మనం వేచి చూడాల్సిందే.