అర్హులందరు ఓటు నమోదు చేసుకోవాలి.
– నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి.
పోటో: ఓటరు నమోదు పత్రాన్ని స్వీకరిస్తున్న ఎంపీపీ.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 5, (జనంసాక్షి)
పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల ఎంపీపీ సంతోషం రమాదేవి అన్నారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓటు అనే వజ్రాయుధం ద్వారా మంచి సమాజం ఏర్పాటుకై కృషి చేయాలన్నారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కుకై దరఖాస్తు చేసుకొని అట్టి ఓటరు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ చీర్ల సత్తెమ్మ, బూత్ లెవల్ ఆఫీసర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.