అర్హులైన అందరికీ అక్రిడేషన్లు

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్ శివలింగయ్య హామీ ఇచ్చారు గత మూడు రోజులుగా జనగామ జిల్లా జర్నలిస్టులు చేస్తున్న నిరసనలో భాగంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరు కువినతిపత్రం అందించారు ఈ సందర్భంగా టీజేయు జిల్లా అధ్యక్షుడు భూస రమేష్ యాదవ్ మాట్లాడుతూ జీవో నెంబర్ 239 ప్రకారం ఎం ప్యానెల్మెంట్ కలిగిన పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఐ య్అండ్ పి ఆర్ ఆదేశాల ప్రకారం కేటాయించిన అక్రిడేషన్ కార్డ్స్ జారీ చేయాలని చిన్న మధ్య తరహా పెద్ద పత్రికల తేడాలు లేకుండా పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల అందరికీ మొదటి విడత ప్రక్రియలోనే అక్రిడేషన్ కార్డ్స్ జారీ చేయాలని  టీజేయు జిల్లా అధ్యక్షుడు భూస రమేష్ కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ అర్హులైన ప్రతి ఒక్కరికి అక్కడేషన్ కార్డ్స్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు.  జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పింగిలి వేణుగోపాల్ రెడ్డి బానోతు అనిల్ కుమార్ సంపత్ మహేందర్ మంగ శంకర్ ఇర్రి మల్లారెడ్డి మామిడాల అశోక్ బండి శ్రీనివాస్ రెడ్డి బాబాపకుర్దిన్ అనిల్ సుధాకర్ వినయ్ సాగర్ భాస్కర్, సూర్య రమేష్, సత్యనారాయణ శ్రీకాంత్ యాదగిరి వెంకన్న సుప్రీం ఉపేందర్ మల్లేష్ భిక్షపతి  తదితరులు పాల్గొన్నారు.