అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసిన సమాచార రక్షణ చట్టం-2005 జిల్లా కమిటీ సభ్యులు.
జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల సెప్టెంబర్ 3-2022
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఇన్చార్జ్ మొగిలి శేఖర్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ మను చౌదరిని కలవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పాత రేషన్ కార్డుదారులకు మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇచ్చి తద్వారా కొత్తవారిని కలుపుకోవడానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు, కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఆప్షన్ ఇవ్వాల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ మను చౌదరిని కలిసి ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఇన్చార్జ్, మొగిలి శేఖర్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కృష్ణ ప్రసాద్, జిల్లా జాయింట్ సెక్రెటరీ, పోల స్వామి, అనకాపల్లి మండల అధ్యక్షులు,సుల్తాన్, అచ్చంపేట మండల జాయింట్ సెక్రెటరీ, గాలిమూడి కిరణ్, జరపాటి వెంకటేష్, మరియు తదితరులు పాల్గొన్నారు.