అలనాటి నటి కృష్ణకుమారి కన్నుమూత

– అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని తన నివాసంలో మృతి
– పలు భాషల్లో 110 చిత్రాల్లో నటించిన కృష్ణకుమారి
– పలువురు సినీ ప్రముఖుల నివాళులు

బెంగళూరు: అలనాటి అందాల నటి కృష్ణకుమారి ఇకలేరు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని తన నివాసంలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1933 మార్చి 6న బంగాల్‌లో జన్మించిన కృష్ణకుమారి.. 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ చిత్రం ద్వారా తెరంగ్రేటం చేశారు. పల్లె పడుచు, బంగారు పాప చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించారు. ఏన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి అగ్రనటులతో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 110 చిత్రాల్లో ఆమె నటించారు. ప్రముఖ నటి షావుకారు జానకికి కృష్ణకుమారి స్వయానా సోదరి.